వరద బాధితులకు జగన్ రూ.1 కోటి ఇచ్చారన్న బొత్స... ఇవ్వలేదన్న మంత్రి పార్థసారథి
- గత ఏడాది విజయవాడను ముంచెత్తిన వరదలు
- వరద బాధితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన జగన్
- ఈ అంశంపై నేడు శాసనమండలిలో చర్చ
- ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదన్న బొత్స
- అందుకే పార్టీ తరఫున తామే సాయం పంపిణీ చేశామని వెల్లడి
దాంతో బొత్స స్పందిస్తూ ... కూటమి ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, అందుకే జగన్ ప్రకటించిన కోటి రూపాయాల విరాళాన్ని తామే వరద బాధితులకు అందజేశామని వెల్లడించారు. అందుకు తానే బాధ్యత తీసుకున్నానని వివరించారు. వరద బాధితులకు పార్టీ తరఫున సాయం అందించామని చెప్పారు.
ఈ క్రమంలో, మండలిలోనే ఉన్న రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందిస్తూ... జగన్ ప్రకటించిన రూ.1 కోటి విరాళంపై విచారణ కమిటీ వేసేందుకు సిద్ధమని అన్నారు.