సరికొత్త రికార్డును అందుకున్న బంగారం ధర
- రూ.88,500కు చేరుకున్న బంగారం ధర
- రూపాయి క్షీణత, అంతర్జాతీయ పరిణామాలతో పెరుగుదల
- రూ.97 వేలు దాటిన వెండి ధర
డాలర్ మారకంతో రూపాయి క్షీణత, అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధర పెరుగుదలకు కారణమని ఆలిండియా సరాఫా ఆసోసియేషన్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ స్పాట్ గోల్డ్ ఔన్స్ 2900 డాలర్లకు చేరుకుంది. ఇక, వెండి ధర కిలోకు రూ.1000 వరకు పెరిగి రూ.97,500కు చేరుకుంది.
ట్రంప్ టారిఫ్లపై చేస్తున్న ప్రకటనలు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మరలుతున్నారు. దీంతో పసిడికి డిమాండ్ పెరుగుతోంది.