'తండేల్' సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

AP Govt gives nod to hike ticket rates for Thandel movie
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం తండేల్. ఉత్తరాంధ్రలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. 

కాగా, ఏపీలో ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మల్టీప్లెక్స్ లలో రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీఎస్టీతో కూడిన ఈ ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు అమల్లో ఉంటాయి. 

తండేల్ చిత్రబృందం నుంచి వచ్చిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఈ మేరకు టికెట్ రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంది.
Go Back to Shorts
Thandel
Ticket Rates
Naga Chaitanya
Sai Pallavi
Chandu Mondeti
Geetha Arts

More Telugu News