సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు

Mohan Babu files petition in Supreme Court
  • జర్నలిస్టుపై దాడి చేసిన కేసు
  • మోహన్ బాబుకు బెయిల్ నిరాకరించిన తెలంగాణ హైకోర్టు
  • హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మోహన్ బాబు
జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో సినీ నటుడు మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు బెయిల్ ను నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు నిర్ణయాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బెయిల్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు... మంచు మనోజ్ మరోవైపు... కేసులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు మీడియా ప్రతినిధులు వెళ్లిన సమయంలో... ఒక జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిని జర్నలిస్ట్ సంఘాలతో పాటు పలువురు తీవ్రంగా ఖండించారు. దాడికి సంబంధించి మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా... ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. దీంతో, తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Go Back to Shorts
Mohan Babu
Tollywood
Supreme Court

More Telugu News