ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు
- ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో అనారోగ్యానికి గురైన మోహన్ బాబు
- హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స
- మధ్యాహ్నం 2 గంటలకు మోహన్ బాబును డిశ్చార్జ్ చేసిన వైద్యులు
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నేరుగా జల్ పల్లి లోని ఇంటికి చేరుకున్నారు. మరోవైపు మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు.