ఏపీలో పర్యాటక రంగానికి కొంత హంగులు.. విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్
- 9న విజయవాడ పున్నమిఘాట్లో ప్రారంభించనున్న చంద్రబాబు
- ప్రయోగం విజయవంతమైతే అందుబాటులోకి రెగ్యులర్ సర్వీసులు
- 14 సీట్లున్న విమానాన్ని రూపొందించిన ‘డీ హవిల్లాండ్’
- రెండో దశలో విశాఖ, నాగార్జునసాగర్, గోదావరి ప్రాంతాలకు విస్తరణ
సీ ప్లేన్ ప్రయోగం నేపథ్యంలో కృష్ణానదిలోని పున్నమిఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ జెట్టీకి అధికారులు మెరుగులు దిద్దుతున్నారు. పున్నమిఘాట్ వద్ద బయలుదేరే విమానం శ్రీశైలంలోని పాతాళగంగ బోటింగ్ పాయింట్ వద్ద ల్యాండ్ అవుతుంది. విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, శ్రీశైల మల్లన్న ఆలయ సందర్శనకు వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉండేలా దీనిని రూపొందిస్తున్నారు. రెండో దశలో విశాఖ, నాగార్జునసాగర్, గోదావరి తదితర ప్రాంతాల్లోనూ సీ ప్లేన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.