ఆసక్తికరంగా వరుణ్ తేజ్ 'మట్కా' టీజర్
- వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబోలో 'మట్కా'
- పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ
- నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
ఇక ఈ సినిమా నుండి తాజాగా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ను ఆద్యంతం ఎంగేజింగ్గా కట్ చేశారు మేకర్స్. విశాఖపట్నం నగరం నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీ ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ గెటప్స్లో వేరియేషన్స్ ప్రేక్షకులను, అభిమానులకు సరికొత్త అనుభూతిని కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. వరుణ్ మొత్తం నాలుగు విభిన్నమైన అవతారాల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఇక సినిమాలో హీరో చెప్పే డైలాగులు కూడా బాగున్నాయి."వైజాగ్ అంటే... ఒకటి సముద్రం గుర్తుకురావాలి లేదా ఈ వాసు గుర్తుకురావాలి", "మనకు ఏది అవసరమో అదే ధర్మం" వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ మూవీలో మెగా ప్రిన్స్ సరసన అందాల భామలు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ బాణీలు అందిస్తున్నాడు. నవంబర్ 14న 'మట్కా' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.