Pawan Kalyan: కుమార్తె ఆద్యతో పవన్ కల్యాణ్ సెల్ఫీ వైరల్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించి, రాష్ట్ర పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కుమార్తె ఆద్య కూడా విచ్చేసింది. ఈ సందర్భంగా పవన్ తన కుమార్తె ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు. సోషల్ మీడియాలో పవన్-ఆద్య సెల్ఫీ వైరల్ అవుతోంది. పవన్ అభిమానులను ఈ ఫొటో ఎంతగానో సంతోషానికి గురిచేసింది.
Pawan Kalyan
Adya
Selfie
Janasena
Andhra Pradesh

More Telugu News