మాజీ సీఎం జగన్ కు మంత్రి అనిత సూటి ప్రశ్న
- 36 హత్యలు ఎక్కడ జరిగాయో వివరాలు చెప్పాలని డిమాండ్
- నాలుగు హత్యలు జరిగితే 36 హత్యలని ప్రచారం చేస్తున్నారని ఫైర్
- ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవన్న హోంమంత్రి
చనిపోయిన వారిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు, నాయకులేనని గుర్తుచేశారు. జరిగిన విషయం ఇది.. కానీ జగన్ మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అనిత ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 హత్యలు జరిగాయని జగన్ చెబుతున్నారని విమర్శించారు. ఆ 36 హత్యల వివరాలు ఇస్తే పోలీసులతో సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. అలాకాకుండా కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తే జగన్ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. ఇంకా ప్రజలు తన మాటలు నమ్ముతారని జగన్ భావించడం హాస్యాస్పదమని హోంమంత్రి అనిత కొట్టిపారేశారు.