ఎన్డీయే కీలక భాగస్వామి నితీశ్ కుమార్పై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
- ప్రధాని మోదీ పాదాలను తాకి బీహార్ను అవమానించారన్న ఎన్నికల వ్యూహకర్త
- రాష్ట్రానికి నాయకుడంటే ప్రజల గౌరవానికి ప్రతీక అని వ్యాఖ్య
- గతవారం జరిగిన ఎన్డీయే పార్టీల సమావేశాన్ని ఉద్దేశించి విమర్శలు
గతంలో నితీష్ కుమార్తో కలిసి పనిచేసిన మీరు ఇప్పుడెందుకు విమర్శిస్తున్నారంటూ జనాలు తనను ప్రశ్నిస్తుంటారని, అయితే నితీశ్ అప్పుడు వేరే వ్యక్తి అని ప్రశాంత్ కిశోర్ అన్నారు. నితీశ్ అప్పుడు తన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదని వ్యాఖ్యానించారు. కాగా 2015లో ఎన్నికల సమయంలో జేడీయూకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత రెండేళ్లకు జేడీయూ పార్టీలో కూడా చేరారు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్లారు.
కాగా లోక్సభ ఎన్నికల్లో నితీశ్ కుమార్ సారధ్యంలోని జేడీయూ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుచుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిన బీజేపీకి టీడీపీ తర్వాత రెండవ అతిపెద్ద మిత్రపక్షంగా జేడీయూ అవతరించిన విషయం తెలిసిందే.