తెలంగాణలో పాఠ్యపుస్తకాల వివాదం... ఇద్దరు అధికారులపై వేటు
- పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ల తొలగింపు
- పాఠశాల విద్య అదనపు డైరెక్టర్కు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్గా బాధ్యతల అప్పగింత
- టీఆర్ఈఐఎస్ కార్యదర్శికి పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్గా బాధ్యతల అప్పగింత
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాల్లో ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు, అధికారుల పేర్లను ముద్రించారు. దీంతో 24 లక్షల పుస్తకాలను వెనక్కి తీసుకున్నారు. తొలుత ఆ పేజీలను చించేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ దాని వెనుక వందేమాతరం, జాతీయగీతం, ప్రతిజ్ఞ ఉండటంతో... స్టిక్కర్ వేయాలని నిర్ణయానికి వచ్చారు.