కంగనా రనౌత్ని చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్!
- చంఢీగఢ్ విమానాశ్రయంలో ఘటన
- సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ
- ఘటనపై విచారణ జరుపుతున్న అధికారులు
ఈ అనూహ్య పరిణామంతో షాక్కు గురైన కంగనా అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లాక సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్కు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చంఢీగడ్ ఎయిర్పోర్టులోని నిషేధిత ప్రదేశంలో ఉన్న సమయంలో తనపై కానిస్టేబుల్ చేయి చేసుకున్నట్టు కంగనా ఆరోపించారు. దీంతో నిందిత కానిస్టేబుల్ను కమాండింగ్ ఆఫీసర్ గదిలో విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. చంఢీగడ్ విమానాశ్రయంలో ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ ఫుటేజీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్టు సీఐఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి.