Chhattisgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఘోర ప్ర‌మాదం.. 15 మంది మృతి!

15 People spot dead in Bus Crash in Chhattisgarh
షార్ట్స్‌లో చూడండి
ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మంగ‌ళ‌వారం రాత్రి ఘోర బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 15 మంది మృత్యువాత ప‌డ్డారు. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగుల‌ను తీసుకెళ్తున్న బ‌స్సు మంగ‌ళ‌వారం రాత్రి 8.30 గంట‌ల ప్రాంతంలో ప్ర‌మాద‌వ‌శాత్తు మట్టి గ‌ని వ‌ద్ద మొరం కోసం త‌వ్విన గొయ్యిలో ప‌డిపోయింది. 

ఈ దుర్ఘ‌ట‌న‌లో 11 మంది అక్క‌డిక‌క్క‌డే చనిపోయారు. న‌లుగురు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 12 మందికి పైగా గాయప‌డ్డారు. స్థానికంగా ఉండే ఓ డిస్టిల‌రీ సంస్థ‌లో ప‌నిచేస్తున్న 30 మంది ఉద్యోగుల‌ను ఇళ్ల‌కు త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఉద్యోగుల‌తో వ‌స్తున్న బ‌స్సు కుమ్హారీ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఖాప్రీ గ్రామం స‌మీపంలో ప్ర‌మాదం బారిన ప‌డింది. 40 అడుగుల లోతున్న గొయ్యిలో బ‌స్సు ప‌డిపోవ‌డంతో ప్రాణ‌న‌ష్టం భారీగా సంభ‌వించింది.
Go Back to Shorts
Chhattisgarh
Road Accident

More Telugu News