ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి
- తెలంగాణ-చత్తీస్గఢ్ సరిహద్దులో ఘటన
- పోలీసులు కూంబింగ్ చేస్తుండగా తారసపడిన మావోయిస్టులు
- ఏకే 47, మూడు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం
కాల్పులు ఆగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏకే 47తోపాటు మూడు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. గత సోమవారం చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.