పళ్లు రాలుతాయ్ అంటూ పేర్ని నానికి కొల్లు రవీంద్ర వార్నింగ్
- చంద్రబాబు, పవన్ పై అవాకులు, చెవాకులు పేలితే పళ్లు రాలతాయ్ అన్న కొల్లు
- చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే పేటీఎం బ్యాచ్ ప్యాంట్లు తడిసిపోయాయని ఎద్దేవా
- జగన్ తో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు విముఖత చూపిస్తున్నారని వ్యాఖ్య
రాష్ట్ర ప్రజలు టీడీపీ - జనసేన మధ్య పొత్తును కోరుకున్నారని కొల్లు రవీంద్ర చెప్పారు. వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా జగన్ తో మాట్లాడేందుకు విముఖత చూపిస్తున్నారని అన్నారు. ఫొటోలు దిగేందుకు కూడా అందరినీ బతిమాలుకోవాల్సిన పరిస్థితి వైసీపీలో ఉందని చెప్పారు. చంద్రబాబు, పవన్ పై విమర్శలు చేసే వైసీపీ నేతలకు ప్రజా క్షేత్రంలో వస్త్రాపహరణం తప్పదని అన్నారు.