గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇంకా రాలేదేం?: కిషన్ రెడ్డి మండిపాటు
- హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందంటూ ట్వీట్
- ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటనలు ఇచ్చిందన్న కిషన్ రెడ్డి
- నమ్మి ఓటు వేసిన యువతను కాంగ్రెస్ నిండా ముంచిందని ఆరోపణ
ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన మిగతా హామీలను తాము తప్పకుండా అమలు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిందని... కానీ ఇప్పుడు హామీల దిశగా ఎలాంటి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. ఫిబ్రవరి నెల వచ్చినప్పటికీ నోటిఫికేషన్ రాలేదన్నారు. నమ్మి ఓటు వేసిన యువతను కాంగ్రెస్ నిండా ముంచిందని ఆరోపించారు. ఇతర హామీలను కూడా దాటవేసే ప్రయత్నం చేస్తోందన్నారు.