గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

Guntur Kaaram pre release event postponed
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. జనవరి 6న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలని చిత్రబృందం భావించింది. ఈ కార్యక్రమంలోనే థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేయాలని నిర్ణయించింది.

అయితే, సెక్యూరిటీ అనుమతులు లభించకపోవడంతో ఈ ఫంక్షన్ ను వాయిదా వేస్తున్నట్టు గుంటూరు కారం టీమ్ వెల్లడించింది. ముందు నిర్ణయించిన మేరకే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు శాయశక్తులా కృషి చేశామని, కానీ అనుకోని కారణాల వల్ల కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. అభిమానులకు క్షమాపణలు తెలుపుకుంటున్నామని వెల్లడించింది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కొత్త తేదీ ప్రకటిస్తామని గుంటూరు కారం టీమ్ తెలిపింది.
Go Back to Shorts
Guntur Kaaram
Pre Release
Postpone
Mahesh Babu
Trivikram Srinivas
Tollywood

More Telugu News