మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన చంద్రబాబు దంపతులు

  • గుణదల మేరీమాత ఆలయంలో చంద్రబాబు దంపతుల ప్రార్థనలు
  • ప్రార్థనల్లో పాల్గొన్న పలువురు టీడీపీ నేతలు
  • విశాఖ నుంచి విజయవాడకు వచ్చిన చంద్రబాబు
విజయవాడ గుణదలలో ఉన్న మేరీమాతను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి దర్శించుకున్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. చంద్రబాబు దంపతులతో పాటు వర్ల రామయ్య, దేవినేని ఉమా, జవహర్, అశోక్ బాబు, నాగుల్ మీరా, కొల్లు రవీంద్ర తదితరులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అంతకు ముందు విశాఖ నుంచి ఆయన విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి మేరీమాత ఆలయానికి వెళ్లారు.


More Telugu News

Chandrababu Mary Matha Gunadala Telugudesam