India: భారత్లో కాలుపెట్టిన 70 మంది ఉగ్రవాదులు!
భారత్లోకి సుమారు 70 మంది ఉగ్రవాదులు అక్రమంగా ప్రవేశించినట్టు కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నకిలీ పాస్పోర్టులతో వీరంతా నేపాల్ సరిహద్దు మీదుగా భారత్లోకి వచ్చినట్టు భావిస్తున్నాయి. ఈ ఉగ్రవాదులు ఐఎస్ఐ, జమాత్ ఉల్ ముజాహిదీన్, బంగ్లాదేశ్కు చెందిన వారిగా గుర్తించాయి. కేంద్రం వెంటనే బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద ఉన్న బలగాలను అప్రమత్తం చేసింది. భారత్లోకి వచ్చిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.