చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రత్యేక గీతం విడుదల

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ రచించి, రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. కన్నీళ్లు కాదు కాదు... కళ్లు ఎరుపెక్కాలి, అంతు తేల్చుకోవాలి అనే పల్లవితో ఈ గీతం ప్రారంభమవుతుంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, దీనిని వ్యతిరేకిస్తూ ఈ గీతాన్ని రూపొందించారు.

ఈ గీతాన్ని బాగా రాశారని గోపాలకృష్ణను అచ్చెన్నాయుడు ప్రశంసించారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్య, పట్టాభిరాం, మాజీ ఎమ్మెల్యే సునీల్‌, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, కౌన్సిల్‌ మాజీ చైర్మన్‌ షరీఫ్‌, ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారు.


More Telugu News