నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టును చిత్తు చేసిన కర్ణాటక
- ప్రపంచ కప్నకు అర్హత సాధించిన డచ్ జట్టు
- మెగా టోర్నీకి సన్నాహాల కోసం ముందుగానే భారత్ వచ్చిన జట్టు
- 50 ఓవర్ల మ్యాచ్లో 142 పరుగుల తేడాతో ఓడించిన కర్ణాటక
ప్రత్యర్థి బౌలర్లలో విక్రమ్జీత్ సింగ్ నాలుగు, ర్యాన్ క్లెయిన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు వచ్చిన డచ్ జట్టు 25 ఓవర్లలోనే 123 పరుగులకే కుప్పకూలింది. ర్యాన్ క్లెయిన్ 49, పాల్ వాన్ 45 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టారు. కర్ణాటక బౌలర్లలో విశ్వథ్ కావేరప్ప, కౌశిక్ చెరో నాలుగు వికెట్లతో నెదర్లాండ్స్ జట్టు నడ్డి విరిచారు. ఒక స్టేట్ టీమ్తో ప్రాక్టీస్ మ్యాచ్లోనే ఇంత ఘోరంగా ఓడి నెదర్లాండ్స్ జాతీయ జట్టు ఇక ప్రపంచ కప్లో టీమిండియా, ఇతర మేటి జట్లకు ఏ మేరకు పోటీ ఇస్తుందన్న ప్రశ్నలు వస్తున్నాయి.