విజయవాడలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నటుడు, 'ఆనంద్' ఫేమ్ రాజా
- 2014లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన ఆనంద్ ఫేమ్
- ఇప్పుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో కాంగ్రెస్లో చేరిక
- అన్ని వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ మాత్రమేనన్న రాజా
ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. మణిపూర్ అంశంపై చాలామంది మాట్లాడలేకపోయారన్నారు. మీడియా, ఇతర పార్టీలు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోలేదని, కాంగ్రెస్ మాత్రం దీటుగా స్పందించిందన్నారు.