ఇండియా పేరు భారత్గా మారిస్తే లాంఛనాలు పూర్తి చేస్తాం!: ఐక్యరాజ్యసమితి
- దేశం పేరు మార్పుపై ఇక్కడ జరుగుతోన్న ప్రచారంపై ఐరాస వ్యాఖ్యానించబోదన్న ప్రతినిధి
- భారత్ భద్రతా మండలిలో చేరే అంశంపై స్పందించిన ఐరాస చీఫ్
- ఈ విషయం తమ చేతుల్లో లేదన్న గుటెరస్
మరోవైపు, భద్రతా మండలిలో భారత్ చేరే అంశంపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్ స్పందించారు. భద్రతా మండలిలో చేరేందుకు భారత్కు సమయం ఆసన్నమైందా? అని విలేకరులు అడిగారు. దీనిపై గుటేరస్ మాట్లాడుతూ... ఈ విషయం తమ చేతుల్లో లేదని, సభ్య దేశాలు తుది నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. భద్రతా మండలిలో ఎవరు ఉండాలనే నిర్ణయం తమది కాదన్నారు. నేటి ప్రపంచంలో బహుపాక్షిక వ్యవస్థను ప్రతిబింబించేలా సంస్కరణలు అవసరమని విశ్వసిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా భారత్ను విశ్వదేశంగా పేర్కొన్నారు.