కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు అందని జీ20 విందు ఆహ్వానం
- ధ్రువీకరించిన ఆయన కార్యాలయం
- ఇతర పార్టీల నేతలకెవ్వరికీ అందని ఆహ్వానం
- కేబినెట్, సహాయమంత్రులు, ముఖ్యమంత్రులకు ఇన్విటేషన్
- ఆహ్వానితుల జాబితాలో పారిశ్రామికవేత్తలు
కేబినెట్, సహాయ మంత్రులు, ముఖ్యమంత్రులందరికీ ఆహ్వానాలు అందాయి. పారిశ్రామికవేత్తలు కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, హెచ్డీ దేవెగౌడకు కూడా ఆహ్వానాలు అందాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్లోని పునరుద్ధరించిన ఇండియా ట్రేడ్ ప్రొమోషన్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్లోని భారత్ మండపంలో ఈ గాలా డిన్నర్ జరగనుంది. డిన్నర్ అనంతరం చిన్నపాటి సాంస్కృతిక కార్యక్రమం కూడా జరగనుంది.