తెలంగాణలో 70 స్థానాలు మావే.. తేల్చేసిన ఉత్తమ్
- ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే విజయమన్న ఉత్తమ్కుమార్రెడ్డి
- ఇండియా కూటమి విజయం సాధించి రాహుల్ ప్రధాని అవుతారని జోస్యం
- కేసీఆర్ను గద్దెదింపుదామని పొంగులేటి పిలుపు
మరోవైపు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిన్న నిర్వహించిన ‘గడపగడపకు కాంగ్రెస్’ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను గద్దెదింపి కాంగ్రెస్ జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంతోపాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీకి చెందిన 35 కుటుంబాలు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాయి.