యోయో టెస్టులో కోహ్లీ కంటే ముందున్న యువ ప్లేయర్
- ఫిట్ నెస్ టెస్టులో టాపర్ గా శుభ్ మాన్ గిల్
- కోహ్లీ స్కోరు 17.2 కాగా గిల్ స్కోరు 18.7 పాయింట్లు
- ఆసియా కప్ కు సిద్దమవుతున్న టీమిండియా
కర్ణాటక ఆలూర్ లోని స్టేట్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన క్యాంప్ లో ప్లేయర్లకు ప్రాక్టీస్ సెషన్ జరుగుతోంది. ఈ సెషన్ కు హాజరయ్యే ముందు ఆటగాళ్లంతా యోయో టెస్టుకు వెళ్లారు. ఇందులో యువ ఆటగాడు శుభ్మాన్ గిల్ 18.7 పాయింట్లు స్కోర్ చేసి మిగతా ఆటగాళ్లకంటే ముందు నిలిచాడు. ఈ ఫిట్ నెస్ పరీక్షకు హాజరైన ఆటగాళ్లందరూ కటాఫ్ పాయింట్లు 16.5 దాటారని అధికారులు తెలిపారు. కాగా, ఈ టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా, ప్రసీద్ధ్ కృష్ణ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ హాజరుకాలేదు.