అమెరికా గడ్డపై భారత జట్టు అదరగొడుతుందా?
- నేడు విండీస్తో టీమిండియా నాలుగో టీ20
- సిరీస్ సమంపై హార్దిక్ సేన గురి
- మ్యాచ్కు వాన ముప్పు
ఓపెనర్లిద్దరూ ఆరంభంలోనే వికెట్లు కోల్పోతున్న టీమిండియా ఒత్తిడిలో పడిపోతోంది. ఈసారైనా ఓపెనర్లు జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాలి. ముఖ్యంగా మూడు ఇన్నింగ్స్ల్లోనూ సింగిల్ డిజిట్లకే ఔటైన శుభ్మన్ గిల్ తన స్థాయికి తగ్గట్టు ఆడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఏడాది తర్వాత అమెరికాలోని లాడర్హిల్లో ఆడబోతున్న టీమిండియా అక్కడ సిరీస్ గెలుస్తుందేమో చూడాలి. మరోవైపు 2–1తో ఆధిక్యంలో ఉన్న వెస్టిండీస్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. పూరన్, పావెల్ ఫామ్లో ఉండగా.. హెట్మయర్ కూడా ఫామ్ అందుకుంటే ఆ జట్టు బలం మరింత పెరగనుంది. అయితే, మ్యాచ్కు వాన ముప్పు పొంచి ఉంది. ఈ రోజు వర్షం పడే అవకాశం 47 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.