Angallu: అన్నమయ్య జిల్లా అంగళ్లులో తీవ్ర ఉద్రిక్తత... టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు

Tension raises in Angallu between TDP and YCP cadre
  • రాయలసీమలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన
  • కురబలకోట మండలం అంగళ్లులో టీడీపీ బ్యానర్ల చించివేత
  • వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న టీడీపీ వర్గీయులు
  • ఇరువర్గాల మధ్య ఘర్షణ.. టీడీపీ కార్యకర్తలకు గాయాలు

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరిలో భాగంగా రాయలసీమలో పర్యటిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో టీడీపీ ఏర్పాటు చేసిన బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించివేయడంతో వివాదం రాజుకుంది. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్ర, ఇతర టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. 

జెండాలను గాల్లో తిప్పుతూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు వైసీపీ శ్రేణులు యత్నించినట్టు టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడికి దిగాయి. అంగళ్లు సెంటర్ వద్దకు ఇరువర్గాలు చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించకుండా, చోద్యం చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

  • Loading...

More Telugu News