మణిపూర్ ఘటనపై కేటీఆర్ ఫైర్.. మరీ ఇంత అనాగరికమా? అంటూ ట్వీట్
- జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్
- ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు
- దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శలు
- అనాగరికత సాధారణ స్థాయికి చేరిందన్న కేటీఆర్
ఈ వీడియోపై తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మరీ ఇంత అనాగరికమా? అంటూ ట్వీట్ చేశారు. దేశంలో అనాగరికత సాధారణ స్థాయికి ఎలా మారిపోయిందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని భయానక హింసాకాండ, అదుపులో లేని శాంతిభద్రతలను కేంద్రం మౌనంగా చూస్తోందని మండిపడ్డారు. మణిపూర్ లో ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నా కేంద్రం పెద్దలు స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.