జనం బాగుపడాలంటే జగన్ పాలన పోవాలి: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, జనం బాగుపడాలంటే రాష్ట్రంలో జగన్ పాలన పోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హలో ఏపీ.. బైబై వైసీపీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తూ ఆయన వారాహి యాత్రను పదో రోజు కొనసాగిస్తున్నారు. అమలాపురం నియోజకవర్గం నేతలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం రోడ్డు షో నిర్వహించారు. పీ గన్నవరంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.