అమెరికాలో దుండగుల కాల్పులు... తెలుగు విద్యార్థి దుర్మరణం
- ఓహాయో రాష్ట్రంలో కాల్పుల కలకలం
- రాజధాని కొలంబస్ నగరంలోని ఓ ఫుడ్ కోర్టులో చొరబడి దుండగుల కాల్పులు
- తూటాలకు నేలకొరిగిన ఏలూరు వాసి సాయీశ్ వీర
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
వెస్ట్బ్రాడ్ స్ట్రీట్లోని షెల్ గ్యాస్ స్టేషన్లో సాయీశ్ క్లర్క్గా పనిచేస్తున్నాడు. సాయీశ్ మరణం అతడి కుటుంబంలో పెను విషాదం నింపింది. మధ్యతరగతికి చెందిన సాయీశ్ హెచ్-1బీ వీసా కూడా తీసుకున్నాడు. అందరితో కలివిడిగా ఉండేవాడని, ఏ సాయం అడిగినా కాదనకుండా చేసేవాడని స్నేహితులు తెలిపారు. కాగా.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.