ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు
- పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం
- మధ్యాహ్నం 3 గంటలకు ముగియనున్న పిళ్లై కస్టడీ గడువు
- ఈలోపే కీలక సమాచారం సేకరించేందుకు అధికారుల ప్రయత్నం
అరుణ్ రామచంద్ర పిళ్లై ఎమ్మెల్సీ కవితకు బినామీ అన్న ఆరోపణల నేపథ్యంలో వివిధ ఆర్థిక లావాదేవీలపై ఇద్దరినీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ కేసులో పిళ్లై కస్టడీ సోమవారం మధ్యాహ్నానికి ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలకు పిళ్లైని తిరిగి కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది కాబట్టి కవితను కన్ ఫ్రంటేషన్ పద్ధతిలో విచారించడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పిళ్లై కస్టడీ ముగిసేలోపు కీలక సమాచారం రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.