ముగిసిన చింతకాయల విజయ్ సీఐడీ విచారణ

సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ ను ఏపీ సీఐడీ అధికారులు ఇవాళ కూడా ప్రశ్నించారు. ఈ విచారణ కొద్దిసేపటి కిందట ముగిసింది. విజయ్ ని ఏడు గంటల పాటు ప్రశ్నించారు. 

విచారణ అనంతరం చింతకాయల విజయ్ మాట్లాడుతూ, రెండోసారి కూడా విచారణకు వెళ్లానని తెలిపారు. సీఐడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని వివరించారు. గత విచారణలో చంద్రబాబు, లోకేశ్ అంశాలు ఎక్కువగా అడిగారని విజయ్ వెల్లడించారు. ఇవాళ కేసుకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగారని తెలిపారు.


More Telugu News