ఢిల్లీ మద్యం కుంభకోణం.. వైసీపీ ఎంపీ కుమారుడి అరెస్ట్
- మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను అదుపులోకి తీసుకున్న సీబీఐ
- అంతకుముందు ఆయనను ప్రశ్నించిన అధికారులు
- నేటి మధ్యాహ్నం రాఘవను కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరనున్న అధికారులు
నేటి మధ్యాహ్నం రాఘవను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హజరుపరిచి కస్టడీకి అనుమతి కోరనున్నారు. కాగా, ఇదే కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం మల్హోత్రా అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచిన అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు రాఘవను కూడా కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరనున్నారు.