నాలుగు పార్టీలు మారిన వ్యక్తి కాంగ్రెస్ ను ఉద్ధరిస్తాడా?: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- మల్లు భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం
- పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయన్న ఉత్తమ్
- కొందరిని అవమానించడానికే డీసీసీల ప్రకటన జరిగిందని విమర్శ
తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనను సపోర్ట్ చేసినవారు, వ్యతిరేకించిన వారు ఉన్నారని చెప్పారు. తనకు నచ్చిన వాళ్లే అన్ని పోస్టుల్లో ఉండాలని తాను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ప్రస్తుత కమిటీల్లో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్లో 50 మందికి పైగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని విమర్శించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలంతా కోవర్టులని తీన్మార్ మల్లన్న పోస్టులు పెడుతున్నారని, నాలుగు పార్టీలు మారిన వ్యక్తి పార్టీని ఉద్ధరిస్తాడని చెపుతున్నాడని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని ప్రశ్నించారు.