ఢిల్లీలో రేపు బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం... మూహూర్త సమయం ఇదే!
- రేపు మధ్యాహ్నం 12.47 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయానికి ప్రారంభోత్సవం
- జెండాను ఆవిష్కరించి, కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
- హాజరుకానున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరుకానున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెపుతున్నారు. పంజాబ్, హర్యానా, తమిళనాడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతు నేతలు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.