Chiranjeevi: 152 సినిమాలు చేసిన మెగాస్టార్ ను ఎలా డీల్ చేయాలనేదే నా టెన్షన్: మోహన్ రాజా

Mohan Raja Interview
షార్ట్స్‌లో చూడండి
మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమా రీమేకులో చేయాలని మొదటి నుంచి చిరంజీవి ఆసక్తిని చూపుతూ వచ్చారు. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఎలా మార్చాలి? దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించాలి? అనే విషయంపై చిరంజీవి చాలా రోజుల పాటు ఆలోచన చేశారు. ఆ తరువాత ఆ ప్రాజెక్టును మోహన్ రాజా చేతుల్లో పెట్టారు. దసరా కానుకగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా తొలి షో తోనే హిట్ టాక్ తెచ్చుకుంది. 

ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో మోహన్ రాజా మాట్లాడూతూ .. "2020 నవంబర్లో చిరంజీవిగారు నాకు ఈ ప్రాజెక్టును అప్పగించారు. 'లూసిఫర్' పట్ల నాకు గల ప్రేమ ఈ రీమేకును ఒప్పుకునేలా చేసింది. మలయాళ ప్రేక్షకుల అభిరుచి వేరు .. తెలుగు ఆడియన్స్ టేస్టు వేరు. అందువలన ఆ కథను ఇక్కడి ప్రేక్షకులకు ఎలా ఎక్కించాలా అనేదే నాముందు సవాలుగా నిలిచింది. ఆ అంశంపైనే నేను కసరత్తు చేస్తూ వెళ్లాను. 

చిరంజీవిగారు ఆల్రెడీ 152 సినిమాలు చేశారు. అంతటి హీరోను కొత్తగా చూపించడమనేది అంత తేలికైన విషయమేమీకాదు. ఏ ఒక్క  సీన్ గానీ .. షాట్ గాని రిపీట్ అనిపించకూడదు. ఈ విషయంలోనే నేను టెన్షన్ పడాల్సి వచ్చింది. ప్రతి సీన్ ను థియేటర్లో ఆడియన్స్ మధ్య కూర్చుని చూస్తున్నట్టుగా అనుకుంటూ డిజైన్ చేసుకున్నాను. అందుకు తగిన రెస్పాన్స్ థియేటర్స్ నుంచి వస్తుండటం ఆనందాన్ని కలిగిస్తోంది" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Chiranjeevi
Salman Khan
Nayanathara
God Father Movie

More Telugu News