నేడు వైఎస్సార్ బతికే ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మేవారు: షర్మిల
- ప్రజా ప్రస్థానంలో నర్సాపూర్లో మాట్లాడిన షర్మిల
- కాంగ్రెస్ను రాష్ట్రంలో రెండు సార్లు వైఎస్సార్ అధికారంలోకి తెచ్చారని వెల్లడి
- కేంద్రంలోనూ పార్టీ అధికారంలోకి వచ్చేలా వైఎస్సార్ చేశారన్న వైఎస్సార్టీపీ అధినేత్రి
అయితే రాజశేఖరెడ్డి చనిపోగానే... ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖరరెడ్డికి వెన్నుపోటు పొడిచిందని షర్మిల అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖరరెడ్డి చనిపోతే... ఆ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కనీసం విచారణ కూడా చేయించలేదని ఆరోపించారు. బతికుండగానే రాజశేఖరరెడ్డిని పొగిడిన కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోగానే నిందలు వేసిందని ఆమె ఆరోపించారు. నిందలు వేసిన రాజశేఖరరెడ్డి బొమ్మను పెట్టుకుని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని ఆమె మండిపడ్డారు.