దృశ్యం మూడో పార్టు వస్తోంది
- ప్రకటించిన నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్
- మూడో పార్టు కాన్సెప్ట్ విని ఓకే చెప్పిన మోహన్ లాల్
- తొలి రెండు పార్టులకు మంచి ఆదరణ
- తెలుగులో అదే పేరుతో రీమేక్ చేసిన వెంకటేష్
‘దృశ్యం’ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం హిందీతో సహా మరో నాలుగు భాషల్లోకి రీమేక్ అయి సక్సెస్ సాధించింది. హిందీ రీమేక్ లో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో కనిపించారు. కన్నడలో వి. రవిచంద్రన్ నటించగా.. తెలుగులో వెంకటేష్ నటించిన రెండు పార్టులూ ప్రేక్షకులను అలరించాయి. తమిళంలో కమల్ హాసన్ నటించారు. కాగా, మూడో పార్టుకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు తెలియాల్సి ఉంది. ‘దృశ్యం 3’ మాతృక వస్తే.. తెలుగులో వెంకటేష్ హీరోగా దీన్ని రీమేక్ చేసే అవకాశాలు లేకపోలేదు.