తెలంగాణలో మరో 443 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona positive cases details
  • గత 24 గంటల్లో 21,918 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 247 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 493 మంది
  • ఇంకా 4,697 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 21,918 శాంపిల్స్ పరీక్షించగా, 443 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 247 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 34, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 30, సంగారెడ్డి జిల్లాలో 27 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 493 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,02,822 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,94,014 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,697 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
New Cases
Positive
Update

More Telugu News