కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ కి ఏడు రోజుల పోలీసు కస్టడీ
- మన్సా చీఫ్ జ్యుడీషియల్ కోర్టు అనుమతి
- మన్సా నుంచి మొహాలీకి బిష్ణోయ్ తరలింపు
- భారీ భద్రత కల్పిస్తున్న రాష్ట్ర యంత్రాంగం
మొహాలీకి తరలించిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (సిట్), యాంటీ గ్యాంగ్ స్టర్ టాస్క్ ఫోర్స్, ఇతర దర్యాప్తు విభాగాలు బిష్ణోయ్ ను విచారించనున్నాయి. సిద్ధూ మసేవాలా హత్య కేసులో అతడి పాత్ర, ఇతరులు ఎవరున్నారనే విషయాలను రాబట్టనున్నారు. మే 29న ఉదయం మూసేవాలా ఆగంతుకుల కాల్పులకు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.