ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, ఇద్దరు సీఎంలు, చంఢీగఢ్లో ఖర్గే అరెస్ట్, విడుదల
- ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
- ఇందుకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు
- ఢిల్లీలో కేసీ వేణు గోపాల్ను ఈడ్చుకెళ్లిన పోలీసులు
- కాంగ్రెస్కు చెందిన ఇద్దరు సీఎంలు, ఖర్గే కూడా అరెస్ట్
- ఆపై నేతలందరినీ విడుదల చేసిన పోలీసులు
ఇలా ఈడీ కార్యాలయాల ముందు నిరసనకు దిగిన నేతల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీఎంలు అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బాఘెల్ (ఛత్తీస్గఢ్), రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్లు కేసీ వేణుగోపాల్ సహా మరికొందరు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ అరెస్ట్ సందర్భంగా ఆయనను ఈడ్చుకుంటూ వెళ్లిన పోలీసుల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శాంతియుత నిరసనకు దిగినా... ఇలా దురుసుగా ప్రవర్తిస్తారా? అంటూ పోలీసులపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.