ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్ ఇంట్లో ఈడీ సోదాలు... భారీగా బంగారం, న‌గ‌దు సీజ్‌

ED has conducted searches Satyendar Kumar Jain house
  • మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో అరెస్టయిన స‌త్యేంద్ర జైన్‌
  • ఇంటిలో 1.80 కిలోల బంగారం, రూ.2.82 కోట్ల న‌గ‌దు గుర్తింపు
  • స‌రైన వివ‌రాలు చెప్ప‌లేక‌పోవ‌డంతో సీజ్ చేసిన ఈడీ
మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఇప్ప‌టికే అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ కీల‌క నేత‌, ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్ ఇంటిలో మంగ‌ళ‌వారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) సోదాలు చేప‌ట్టింది. ఈ సోదాల్లో మంత్రి ఇంటిలో 1.80 కిలోల బంగారం, రూ.2.82 కోట్ల న‌గ‌దు ల‌భ్య‌మయ్యాయి. ఈ బంగారం, న‌గ‌దుకు సంబంధించి స‌త్యేంద్ర జైన్ స‌రైన వివ‌రాలు చెప్ప‌లేక‌పోవ‌డంతో వాటిని ఈడీ అధికారులు సీజ్ చేశారు. 

కోల్‌క‌తాకు చెందిన ఓ కంపెనీతో మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని చాన్నాళ్ల నుంచి స‌త్యేంద్ర జైన్‌పై ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై ఇటీవ‌లే కేసు న‌మోదు చేసిన ఈడీ అధికారులు గ‌త వారం ఆయ‌న‌ను అరెస్ట్ చేయగా, కోర్టు రిమాండ్‌కు పంపిన సంగతి విదితమే. 
Go Back to Shorts
Delhi
AAP
Enforcement Directorate
Satyendar Kumar Jain

More Telugu News