తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే: ఈటల రాజేందర్
- కాంగ్రెస్ దీపం ఢిల్లీలోనే ఆరిపోయిందన్న ఈటల
- తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని విమర్శ
- నేనే రాజు నేనే మంత్రి, నేనే సీఎం అనుకుంటున్నారన్న ఈటల
ప్రస్తుతం తెలంగాణలో సాగుతున్నది ప్రజా కంటక, ప్రజా వ్యతిరేక పాలనేనని, దానిపై బీజేపీ కొట్టాడుతోందని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో నేనే రాజు, నేనే మంత్రి, నేనే సీఎం అనుకుంటూ తామేం చేసినా చెల్లుబాటు అవుతుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ తరహా పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరాల్సిందేనని ఈటల చెప్పారు.