అసలు కుట్రదారు ఇమ్రాన్ ఖానే: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
- పాక్ లో జాతీయ అసెంబ్లీ రద్దు
- ప్రధాని ఇమ్రాన్ సిఫారసుతో దేశాధ్యక్షుడి నిర్ణయం
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారన్న నవాజ్ షరీఫ్
- ఇమ్రాన్, తదితరులను విచారించాలని డిమాండ్
ప్రధాని ఇమ్రాన్, ఇతరులు దేశానికి వ్యతిరేకంగా కుట్రకు పాల్పడ్డారని, వారు అత్యంత దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అపవిత్రం చేశారని, వారిని రాజ్యాంగంలోని ఆర్టికల్-6 ప్రకారం తప్పకుండా విచారించాల్సిందేనని తెలిపారు. "అధికారం కోసం పాకులాడిన ఓ వ్యక్తి ఈరోజు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు" అంటూ నవాజ్ షరీఫ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా నవాజ్ షరీఫ్ లండన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.