Andhra Pradesh: ఏపీలో గత 24 గంటల్లో 8 కొత్త కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!

AP Corona daily updates
  • తాజాగా 8,017 కరోనా పరీక్షలు
  • కృష్ణా జిల్లాలో 2 కేసులు
  • పలు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • ఇంకా 251 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 8,017 కరోనా పరీక్షలు నిర్వహించగా, 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 2 కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కేసు వెలుగు చూశాయి. 

అదే సమయంలో 45 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,19,532 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,551 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 251 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
.
Andhra Pradesh
Corona Virus
Updates
Daily Cases

More Telugu News