Team India: 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. కోహ్లీ డకౌట్!

Kohli duck out in 2nd ODI
  • 18 ఓవర్లలో 90 పరుగులు చేసిన ఇండియా
  • తొలి వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన రాహుల్, ధావన్
  • 38 పరుగులతో ఆడుతున్న రాహుల్
పార్ల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఓపెనింగ్ కు దిగిన కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ మంచి ప్రారంభాన్ని అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ తరుణంలో 11.4 ఓవర్ల వద్ద ధావన్ మార్క్ రమ్ బౌలింగ్ లో మగాలాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ 5 బంతులను ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. మహరాజ్ బౌలింగ్ లో బవుమాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం రాహుల్ కు రిషభ్ పంత్ జత కలిశాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 38 పరుగులు, పంత్ 15 పరుగులతో ఆడుతున్నారు.
Team India
South Africa
2nd ODI

More Telugu News