రోడ్లు కత్రీనా చెంపల్లా మెరిసిపోవాలన్న రాజస్థాన్ మంత్రి... మండిపడుతున్న బీజేపీ
- మంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన రాజేంద్ర సింగ్
- తన నియోజకవర్గంలో సభ
- రోడ్ల అంశంలో కత్రీనా ప్రస్తావన
- మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న బీజేపీ
రాజేంద్ర సింగ్ ఇటీవలే గెహ్లాట్ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. అయితే, ఆయన వ్యాఖ్యల పట్ల విపక్ష బీజేపీ మండిపడుతోంది. బీజేపీ అధికార ప్రతినిధి రామ్ లాల్ శర్మ స్పందిస్తూ, ఓ మహిళ ప్రస్తావన తెస్తూ అలాంటి వ్యాఖ్యలు చేయడం అనుచితం అని పేర్కొన్నారు. సదరు మంత్రిపై సీఎం గెహ్లాట్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజస్థాన్ సంస్కృతి, సంప్రదాయం కాదని హితవు పలికారు.