దేశంలో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. 543 రోజుల కనిష్ఠానికి!
- దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
- నిన్న 7,579 కేసుల నమోదు
- కేరళలోనే సగం కేసులు.. మరణాలు కూడా అక్కడే ఎక్కువ
- ఇప్పటి వరకు 117 కోట్ల కరోనా డోసుల పంపిణీ
నిన్న 12,202 మంది కరోనా నుంచి బయటపడ్డారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3.39 కోట్లకు పెరిగింది. 1,13,584 కేసులు యాక్టివ్గా ఉన్నట్టు కేంద్రం తాజా బులెటిన్లో వెల్లడించింది. రికవరీల రేటు 98.32 శాతానికి పెరిగిందని పేర్కొంది. అలాగే, నిన్న 71,92,154 మంది టీకాలు వేయించుకున్నారని, వీరితో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 117 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది.