సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న మహిళా రైతులు.. తిరిగి వెళ్తుండగా ట్రక్కు ఢీ కొని ముగ్గురి మృతి
- హర్యానాలో ఘటన
- మరో నలుగురు రైతులకు గాయాలు
- పారిపోయిన ట్రక్కు డ్రైవర్
అదే సమయంలో ప్రమాదవశాత్తూ ఓ ట్రక్కు వచ్చి వారిని ఢీ కొట్టింది. దాంతో ఇద్దరు మహిళా రైతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు రైతులకు గాయలయ్యాయి. వారిలో ముగ్గురు మహిళలే ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు.